Saturday 3 February 2018

గుడిలేదు గోపురంలేదు అయినా కోట్లాది జనం



ఈ రోజే జాతర చివరి రోజు కావటంతో , దేవతల వనప్రవేశంలోపు వెళ్లాలని ఉదయాన్నే బయల్దేరనుకున్నాం.



ఎందుకంటే దాదాపు 100 కిలోమీటర్లు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుంటే
 ఓ రెండున్నర గంటల్లో వెళ్ళొచ్చు కాని జామ్ అయితే అమ్మల దర్శనం కుదరదని
ముందుగానే రెడీ అయి వెళ్ళినా భయపడినంతా అయింది.
 ట్రాఫిక్ జామ్ లో దాదాపు గంటన్నర ఆగిపోవాల్సివచ్చింది. ఎప్పుడూ  ట్రాఫిక్ జామ్ లు ఎరుగని మాకు ఇవి మాకు కాస్త విసుగనిపించింది. కానీ మా హైదరాబాద్ లాంటి నగరవాసులకు అలవాటే అని పక్క సీటు లో కూర్చున్నతను అన్నాడు. దాదాపు 200 కిలోమీటర్లు వన్ వే చేసినా, కొన్నిచోట్ల అధికార్ల సమన్వయలోపం, కొందరు వాహనదార్ల అత్యుత్సాహం, ముందుగా వెళ్ళాలనే తపనతో అడ్డ దిడ్డంగా వెళ్ళటం ట్రాఫిక్ జామ్కి కారణమట. అయినా మేడారం చేరేసరికి మధ్యాహ్నం రెండైనా
మా తమ్ముడి బంధువు గుడి దగ్గర డ్యూటీలో ఉండటంతో vip దర్శనం పది నిమిషాల్లో అయింది.
కాని గద్దెల దగ్గరికి వెళ్ళగానే మిత్రుడు చెప్పినట్టు
గుడిలేదు గోపురంలేదు                  
అర్చనలేదు అభిషేకం అంతకన్నాలేదు                           
తీర్థంలేదు తియ్యని లడ్డులేదు        
 మడిలేదు మంగళహారతిలేదు 
కోలవడానికి ఓ రూపంలేదు 
కలవడానికి ప్రత్యేకదారుల్లేవు   
ఉన్నదొక్కటే నమ్మకం 'అమ్మ' అంటే ఆకలితీరుస్తది' 
ఆనమ్మకమే 'సమ్మక్క-సారక్క అనిపించింది. 
ఒకప్పుడు వేళల్లో ఉన్న భక్తులు కోట్లకు చేరటమే అందుకు నిదర్శనం.
ఇక్కడ క్లిక్ చేయండి వివరాలకు 
తెచ్చిన బంగారం(బెల్లం), టెంకాయలు అమ్మలకు సమర్పించి 
బయటకు రాగానే జ్యోతిష్యం చేపుతామంటూ కోయదొరలు,
పూసలదండలు, రుద్రాక్ష మాలలు కొనండని ఒకరు,
బొమ్మలు కొనమని ఇంకొకరు, వాళ్ళందరిని తప్పించుకొని
తెచ్చుకున్న  భోజనాలు ముగించుకొని తిరుగుప్రయానమయ్యాం
అమ్మల ఆశీర్వాదంతో,

గిరిజన మ్యూజియం


వేలాది బస్సులు ఒకే చోట 

No comments:

Post a Comment