Tuesday 13 February 2018

అన్నా మనం చేపలు తినవచ్చా?


అన్నా మనం చేపలు తినవచ్చా?
అంటూ ఒక మిత్రుడు అడిగిన ప్రశ్న ఈ పోస్ట్ రాసేందుకు ఉపక్రమించేలా చేసింది.

వాస్తవానికి శాకాహారం వలన సాత్విక లక్షణాలు పెరుగుతాయి.
మాంసాహారం తినటం వలన కలిగే రజో గుణం మనల్ని తప్పు దారిలో నడిపిస్తుంది.
అదే సాత్విక గుణం మనల్ని ధర్మాధర్మ విచక్షణ చేసే స్థితిలో ఉంచి జ్ఞానం వైపు నడిపిస్తుంది. 

అందుకే ప్రాచీన కాలంలో సమాజంలో ఆచార్యులుగా వ్యవరించే బ్రాహ్మణులకు,
వ్యాపార వర్గాలైన వైశ్యులకు ఇంకా మరికొన్ని సామాజిక వర్గాలకు నిషేధించి ఉండవచ్చు.
వీళ్ళకే ఎక్కువగా సహనాన్ని, శాంతిని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.

ఎంతకాలం మానవులు జీవులను హింసిస్తుంటారో, చంపుతుంటారో అంత కాలం యుద్ధాలుంటాయి అని  జార్జి బెర్నాడ్ షా అన్నారు 

హిందువులు, బౌద్దులు, జైనులు ఎక్కువగా ఉండే భారత్, నేపాల్, భూటాన్,శ్రీలంక తదితర దేశాలలో శాకాహారుల జనాభా మొదటి నుంచి ఎ క్కువగానే ఉంది. మాంసాహారంపై మతపరమైన ఆంక్షలేవీ లేని పాశ్చాత్య ప్రపంచంలో మా త్రం శాకాహారుల జనాభా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది .
కొన్ని నివేదికల ప్రక్కరం భారతదేశంలో 31 శాతం,బ్రిటన్‌లో 21 వాతం, యురోప్‌లో 10 శాతం,అమెరికాలో 4 శాతం శాకాహారులు ఉన్నారట.
మాంసాహారులు ఎక్కువగా ఉండే స్పెయిన్, నెదర్లాండ్, స్వీడన్, ఇజ్రాయిల్ వంటి యురోపియన్ దేశాల్లో.... కానీ మన దేశంలో తగ్గుతున్నాయి.

ఇక  నాలాంటి శాకా హారులుగానే ఉందామనుకునే నిర్ణయమున్న
వారికి బయటకెళ్లి తినటం అనేది జటిలంగా
మరుతోంది మన శాకాహార దేశంలో నిజమేనండీ !!
నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను శాకాహారులు తగ్గిపోవడం వల్ల.
నలుగురితో కలసి పార్టీ లకు, ఫంక్షన్లకు  వెళ్ళాలంటే
నా వల్ల వారికి, వారి వల్ల నాకు ఇబ్బంది కలుగుతోంది.
ఏదైనా వెజ్ ఆర్డర్ చేస్తే దానిలో ముక్కలు తీసేసి
తీసుకోస్తారని అనుమానం బాగా.. ఇంకా బిర్యానికి ఇచ్చే సూప్ ఐతే మరీ.. 
గతంలో ఒకసారి కేరళ టూర్ వెళ్ళినపుడు భోజనానికి చాలా ఇబ్బంది అన్నాను కదా.  clik hear
మాతో వచ్చిన ఒక మిత్రుని కోసం ప్యూర్ వెజ్ హోటల్ కోసం గంటన్నర వెదకాల్సి వచ్చింది.

No comments:

Post a Comment