Tuesday 27 February 2018

పెళ్లి లాంటి నిశ్చితార్ధం


నా చిన్నప్పుడు నిశ్చితార్ధం అంటే 
ఓ పది మంది మగ పెళ్లి వాళ్ళు వచ్చి అమ్మాయి మెళ్ళో 
ఎదో ఒక నగ వేసి, బట్టలు, "పూలు పండ్లు" పెట్టి వెళ్ళేవారు.
ఆడపెళ్ళి వాళ్ళు సైతం ఓ పదిమంది వెళ్లి వరునికి 
ఏ సైకిలో గడియారమో ముట్టజెప్పి కాసిన్ని డబ్బులతో "వరపూజ" చేసెటోల్లు.
అదికూడా కాస్త పెళ్ళికి ఎక్కువ సమయం ఉంటేనే.
అదీ లేకుంటే ఇంకాస్త చిన్నగానే చేసేవాళ్ళు.
అప్పుడే లగ్నపత్రికలు రాయించుకొని మార్చుకోనేవాళ్ళు. 
అంతే అంతటితో నిశ్చితార్థం అయిపోయినట్టే.

కాని ఈమధ్యకాలంలో 
పెళ్ళికి నిశ్చితార్దానికి పెద్దగా తేడా ఉండడంలేదు
పెళ్ళికి వచినంత చుట్టాలు, హంగు ఆర్భాటాలు
ఉంటున్నాయి.
జిలకర బెల్లం, తాళిబొట్టు తప్పించి అన్నీ ఉంటున్నాయి.
దాదాపు పెళ్లి లాగాఆర్భాటాలు, బంధువులు, 
ఆర్కెస్ట్రా, డాన్స్ లు....
వెల్ కం డ్రింక్నుండి మొదలుకొని ఆఖర్న ఐస్ క్రీం వరకు 
పళ్ళెం లో కనీసం ఇరవై రకాల పైననే ఉంటున్నాయి.

ఇక అతిథుల ముందు ఉంగరాలు మార్చుకోవడం 
తోటి మొదలవుతుంది ఫోటోల తంతు 
సినిమా షూటింగు లను తలపించేలా  
ఓ క్రేను,ఐదారుగురు కేమరామేన్లు... 
అబ్బో అదో అన్నపూర్ణ స్టూడియో ,
(నా కాలేజ్ రోజుల్లో యూసుఫ్ గూడలో ఉన్నప్పుడు 
అన్నపూర్ణ స్టుడియోలో షూటింగ్ చూడ్డానికి వెళ్ళా )
అదే గుర్తుకొస్తుంది.

ఏదేమైనా ఈ అనవసరపు ఆర్భాటాలు 
పెళ్ళికూతురి తండ్రికి ఆర్ధిక భారాన్ని మోపేవే  తప్పించి 
పెద్దగా అవసరం లేదని నా అభిప్రాయం...

Tuesday 13 February 2018

అన్నా మనం చేపలు తినవచ్చా?


అన్నా మనం చేపలు తినవచ్చా?
అంటూ ఒక మిత్రుడు అడిగిన ప్రశ్న ఈ పోస్ట్ రాసేందుకు ఉపక్రమించేలా చేసింది.

వాస్తవానికి శాకాహారం వలన సాత్విక లక్షణాలు పెరుగుతాయి.
మాంసాహారం తినటం వలన కలిగే రజో గుణం మనల్ని తప్పు దారిలో నడిపిస్తుంది.
అదే సాత్విక గుణం మనల్ని ధర్మాధర్మ విచక్షణ చేసే స్థితిలో ఉంచి జ్ఞానం వైపు నడిపిస్తుంది. 

అందుకే ప్రాచీన కాలంలో సమాజంలో ఆచార్యులుగా వ్యవరించే బ్రాహ్మణులకు,
వ్యాపార వర్గాలైన వైశ్యులకు ఇంకా మరికొన్ని సామాజిక వర్గాలకు నిషేధించి ఉండవచ్చు.
వీళ్ళకే ఎక్కువగా సహనాన్ని, శాంతిని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.

ఎంతకాలం మానవులు జీవులను హింసిస్తుంటారో, చంపుతుంటారో అంత కాలం యుద్ధాలుంటాయి అని  జార్జి బెర్నాడ్ షా అన్నారు 

హిందువులు, బౌద్దులు, జైనులు ఎక్కువగా ఉండే భారత్, నేపాల్, భూటాన్,శ్రీలంక తదితర దేశాలలో శాకాహారుల జనాభా మొదటి నుంచి ఎ క్కువగానే ఉంది. మాంసాహారంపై మతపరమైన ఆంక్షలేవీ లేని పాశ్చాత్య ప్రపంచంలో మా త్రం శాకాహారుల జనాభా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది .
కొన్ని నివేదికల ప్రక్కరం భారతదేశంలో 31 శాతం,బ్రిటన్‌లో 21 వాతం, యురోప్‌లో 10 శాతం,అమెరికాలో 4 శాతం శాకాహారులు ఉన్నారట.
మాంసాహారులు ఎక్కువగా ఉండే స్పెయిన్, నెదర్లాండ్, స్వీడన్, ఇజ్రాయిల్ వంటి యురోపియన్ దేశాల్లో.... కానీ మన దేశంలో తగ్గుతున్నాయి.

ఇక  నాలాంటి శాకా హారులుగానే ఉందామనుకునే నిర్ణయమున్న
వారికి బయటకెళ్లి తినటం అనేది జటిలంగా
మరుతోంది మన శాకాహార దేశంలో నిజమేనండీ !!
నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను శాకాహారులు తగ్గిపోవడం వల్ల.
నలుగురితో కలసి పార్టీ లకు, ఫంక్షన్లకు  వెళ్ళాలంటే
నా వల్ల వారికి, వారి వల్ల నాకు ఇబ్బంది కలుగుతోంది.
ఏదైనా వెజ్ ఆర్డర్ చేస్తే దానిలో ముక్కలు తీసేసి
తీసుకోస్తారని అనుమానం బాగా.. ఇంకా బిర్యానికి ఇచ్చే సూప్ ఐతే మరీ.. 
గతంలో ఒకసారి కేరళ టూర్ వెళ్ళినపుడు భోజనానికి చాలా ఇబ్బంది అన్నాను కదా.  clik hear
మాతో వచ్చిన ఒక మిత్రుని కోసం ప్యూర్ వెజ్ హోటల్ కోసం గంటన్నర వెదకాల్సి వచ్చింది.

Saturday 3 February 2018

గుడిలేదు గోపురంలేదు అయినా కోట్లాది జనం



ఈ రోజే జాతర చివరి రోజు కావటంతో , దేవతల వనప్రవేశంలోపు వెళ్లాలని ఉదయాన్నే బయల్దేరనుకున్నాం.



ఎందుకంటే దాదాపు 100 కిలోమీటర్లు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుంటే
 ఓ రెండున్నర గంటల్లో వెళ్ళొచ్చు కాని జామ్ అయితే అమ్మల దర్శనం కుదరదని
ముందుగానే రెడీ అయి వెళ్ళినా భయపడినంతా అయింది.
 ట్రాఫిక్ జామ్ లో దాదాపు గంటన్నర ఆగిపోవాల్సివచ్చింది. ఎప్పుడూ  ట్రాఫిక్ జామ్ లు ఎరుగని మాకు ఇవి మాకు కాస్త విసుగనిపించింది. కానీ మా హైదరాబాద్ లాంటి నగరవాసులకు అలవాటే అని పక్క సీటు లో కూర్చున్నతను అన్నాడు. దాదాపు 200 కిలోమీటర్లు వన్ వే చేసినా, కొన్నిచోట్ల అధికార్ల సమన్వయలోపం, కొందరు వాహనదార్ల అత్యుత్సాహం, ముందుగా వెళ్ళాలనే తపనతో అడ్డ దిడ్డంగా వెళ్ళటం ట్రాఫిక్ జామ్కి కారణమట. అయినా మేడారం చేరేసరికి మధ్యాహ్నం రెండైనా
మా తమ్ముడి బంధువు గుడి దగ్గర డ్యూటీలో ఉండటంతో vip దర్శనం పది నిమిషాల్లో అయింది.
కాని గద్దెల దగ్గరికి వెళ్ళగానే మిత్రుడు చెప్పినట్టు
గుడిలేదు గోపురంలేదు                  
అర్చనలేదు అభిషేకం అంతకన్నాలేదు                           
తీర్థంలేదు తియ్యని లడ్డులేదు        
 మడిలేదు మంగళహారతిలేదు 
కోలవడానికి ఓ రూపంలేదు 
కలవడానికి ప్రత్యేకదారుల్లేవు   
ఉన్నదొక్కటే నమ్మకం 'అమ్మ' అంటే ఆకలితీరుస్తది' 
ఆనమ్మకమే 'సమ్మక్క-సారక్క అనిపించింది. 
ఒకప్పుడు వేళల్లో ఉన్న భక్తులు కోట్లకు చేరటమే అందుకు నిదర్శనం.
ఇక్కడ క్లిక్ చేయండి వివరాలకు 
తెచ్చిన బంగారం(బెల్లం), టెంకాయలు అమ్మలకు సమర్పించి 
బయటకు రాగానే జ్యోతిష్యం చేపుతామంటూ కోయదొరలు,
పూసలదండలు, రుద్రాక్ష మాలలు కొనండని ఒకరు,
బొమ్మలు కొనమని ఇంకొకరు, వాళ్ళందరిని తప్పించుకొని
తెచ్చుకున్న  భోజనాలు ముగించుకొని తిరుగుప్రయానమయ్యాం
అమ్మల ఆశీర్వాదంతో,

గిరిజన మ్యూజియం


వేలాది బస్సులు ఒకే చోట