Tuesday 9 May 2017

జై హనుమాన్



నేటితో హనుమద్దీక్షలకు చివరి రోజు కావటంతో
ఆలయాలన్నీ కిటకిటలాడాయి.

దీక్షావస్త్రాల దుకాణాలు ఒక్కసారిగా జనంతో నిండిపోయాయి.
ఇక పూజాసామాగ్రి, మాలలు అమ్మే దుకాణాలు సరేసరి.

పరిస్టితులు అనుకూలించపునపుడు,
సహకరించనపుడు మాత్రమే 11రోజుల దీక్షకు ఉపక్రమించాలి.
లేదంటే 41లేదా 21రోజులకే తీసుకోవటం మంచిది.

దీక్షాకాలంలో
 కాషాయ  రంగు వస్త్రా లనే ధరించాలి.
దీక్షను చేపట్టేముందు కనీసం మూడు రోజుల ముందు సాత్వికాహారం తీసుకోవాలి.
దీక్షా కాలంలో తల, గడ్డం, వెంట్రుకలు, గోళ్లను కత్తిరించకూడదు. పాదరక్షలు ధరించరాదు.
దీక్షా సమయంలో ఒకసారి కనీసం తమ శక్తికొద్దీ ఐదుగురు స్వాములకు
 భిక్ష ఏర్పాటు చేయాలి. మధ్యాహ్నం ఒకపూట భిక్ష (భోజనం)చేయాలి.
 రాత్రి అల్పాహారం తీసుకోవాలి . మితంగా భుజించటం అలవర్చుకోవాలి
అహింస, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహం,
బ్రహ్మచర్యం పాటించాలి. సత్కర్మలతో పాటు వాక్కు శుద్ధిగా ఉండాలి.
మత్తు పానీయాలు తీసుకోకూడదు. ధూమపానం చేయవద్దు .
(మద్యం, మాంసం  వ్యాపారులు ఆలోచించి,గురుస్వాముల లేదా
 అర్చకుల సలహా తీసుకొని  దీక్ష తీసుకోవటం మంచిది.)
దీక్షా సమయంలో కటిక నేలపై నిద్రించాలి.

గుండెనిండా చీకట్లు మాత్రమే పొంగిపోర్లుతున్నపుడు
భగవంతున్నిమనస్పూర్తిగా  వేడుకో
 కమ్ముకున్న ఉదాసీనతలన్నీ ఒక్కసారిగా కరిగిపోతాయి.

నాస్తికత,హేతువాదం ప్రబలినప్పటికి,
పరమత ప్రభావం వల్లనూ సనాతన ధర్మం
ఇక కనుమరుగుకాదు అని ఇవ్వాల బలంగా అనిపించింది
ఈమధ్య హిందూ జీవన విధానంలో అంతర్భాగమైన
మతాల మధ్య చిచ్చుపెట్టి హిందూ ఐక్యతను
దెబ్బ తీయాలనిచూస్తున్న విదేశీ శక్తులనుండి
తర్వాతి తరాలకు హైందవ ధర్మాన్ని  అందించాలి 

No comments:

Post a Comment